ప్రసార భారతి కాదు ప్రచార భారతి !.. కాషాయ రంగులోకి మారిన డీడీ న్యూస్‌ చిహ్నం

ప్రసార భారతి కాదు ప్రచార భారతి !.. కాషాయ రంగులోకి మారిన డీడీ న్యూస్‌ చిహ్నం

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ జాతీయ టెలివిజన్ ఛానల్ దూరదర్శన్ కేంద్ర ప్రభుత్వం పట్ల స్వామి భక్తిని ప్రదర్శించింది. వార్తలను ప్రసారం చేసే దూరదర్శన్ న్యూస్ ఛానల్ లోగో రంగును కాషాయ రంగులోకి మార్చేసి తన విధేయతను ప్రదర్శించుకుంది. లోగోతో పాటు న్యూస్ అనే అక్షరాలను కూడా కాషాయ రంగులోకి మార్చడం పట్ల అధికార బీజేపీపై పెద్దయెత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.‘ఎంతో చరిత్ర ఉన్న డీడీ న్యూస్ లోగో కాషాయరంగులోకి మారిపోయింది. ఇది ప్రసార భారతి కాదు ప్రచార భారతి’ అని గతంలో దూరదర్శన్ సీఈవోగా పనిచేసిన టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ విమర్శించారు. దూరదర్శన్ చర్య మత ఉద్రిక్తతలను పెంచుతుందని కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos