సోము వీర్రాజు తాగుబోతులకు అధ్యక్షుడా ?

సోము వీర్రాజు తాగుబోతులకు అధ్యక్షుడా ?

తిరుమల : బీజేపీ అధికారంలోకి వస్తే రూ.50లకే క్వార్టర్ నాణ్యమైన మద్యాన్ని ఇస్తామన్న సోము వీర్రాజు బీజేపీ ఏపీకి అధ్యక్షుడా? లేదంటే తాగుబోతులకు అధ్యక్షుడా? అన్నది అర్థం కావడం లేదని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి ఎద్దేవా చేశారు. గురు వారం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన విలేఖరులతో మాట్లడారు. ‘చీప్ లిక్కర్ ఇచ్చి వారిని సంతోష పెడతానని చెప్పడంతో సోము వీర్రాజు వ్యక్తిత్వం ఎలాంటిదో తెలిసిపోతోంది. ఆయన లాంటి వ్యక్తులు బీజేపీలో ఉంటే పార్టీకి ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని ప్రధాని మోదీ గుర్తించాలి. సోము వీర్రాజులాంటి వాళ్లు రాజకీయాల్లోకి ఎందుకొచ్చారో అర్థం కావడం లేదు. ఎవరెన్ని కుట్రలు చేసినప్పటికీ ముఖ్యమంత్రి జగన్కు భగవంతుడి ఆశీస్సులున్నాయి. జగన్ ఓ సింహంలాంటి వారు. ఎంతమంది వచ్చినా జగన్ ఒంటరిగానే పోరాడతారు. సీఎంగా చంద్రబాబు నాయుడు ఉంటే కోటీశ్వరులకు లబ్ధి కలుగుతుంద’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos