ఆపద్బాంధవులకు ఎమ్మెల్యే సత్య ఆపన్న హస్తం

ఆపద్బాంధవులకు ఎమ్మెల్యే సత్య ఆపన్న హస్తం

న్యూస్ ఎక్స్ ప్రెస్ వార్తకు స్పందన
హొసూరు : ఆపద సమయంలో సకాలంలో బాధితులను ఆస్పత్రులకు చేర్చుతూ ప్రాణాలు నిలబెడుతున్న ఆపద్బాంధవులు అయిన ప్రభుత్వ అంబులెన్స్ 108 సిబ్బందికి నిత్యావసరాలు అందజేసి హొసూరు ఎమ్మెల్యే సత్య తన ఉదారతను చాటుకున్నారు. 2 రోజుల క్రితం న్యూస్ ఎక్స్ ప్రెస్ వెబ్ సైట్ లో ప్రభుత్వ,  ప్రైవేట్ ఆంబులెన్స్ లలో పని చేస్తున్న సిబ్బందిని ఏ రాజకీయ నాయకులు ఆదుకోలేదని వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన హొసూరు ఎమ్మె ల్యే ఎస్ ఏ సత్య 50 మంది అంబులెన్స్ సిబ్బంది కి నిత్యావసరాలను అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. నెల రోజులుగా అమలవుతున్న లాక్ డౌన్ వల్ల వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ప్రజలకు నిత్యావసరాలను అందజేస్తున్నారు. పేదలకు నిత్యావసరాలు అందజేసి తమ ఉదారతను చాటుకున్న నాయకులు, ఆపద సమయంలో ప్రాణాలు కాపాడే 108 అంబులెన్సు సిబ్బందికి నిత్యావసరాలు ఇవ్వడం మరిచిపోయారు. 108 అంబులెన్స్ సిబ్బందిని ఎవరూ పట్టించుకోలేదని, నాయకులు వీరిని ఆదుకోవాలని ప్రచురితమైన వార్తకు ఎమ్మెల్యే  సత్య స్పందించడం గమనార్హం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos