అమరావతి: చంద్రబాబు నాయుడికి ఇవే చివరి ఎన్నికలని మాజీ మంత్రి, వైసీపీ నేత సి. రామ చంద్రయ్య అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పై తప్పుడు కేసులు బనాయించింది చంద్రబాబేనని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ మాజీ సంయుక్త సంచాలకులు లక్ష్మీ నారాయణ తెలుగు దేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకోవటమే దీనికి తిరుగులేని నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు , ఈ ఎన్నికల్లో చంద్ర బాబుకు తగిన గుణ పాఠాన్ని నేర్పుతారని ఆశించారు.