ఇళ్ళ పట్టాలకై సీపీఐ ధర్నా

ఇళ్ళ పట్టాలకై సీపీఐ ధర్నా

హొసూరు : పట్టణ పరిధిలో ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ళు నిర్మించుకొని ఏళ్ల తరబడి నివాసమున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ కార్యకర్తలు స్థానిక తాలూకా కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. సీపీఐ కృష్ణగిరి జిల్లా సమితి అధ్యక్షుడు టి. రామచంద్రన్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామచంద్రన్ మాట్లాడుతూ హొసూరు ప్రాంతంలో పేదలు ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకొని ఏళ్ల తరబడి నివాసముంటున్నారని, వారికి పట్టాలు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకునే నాథుడే లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా
అధికారులు స్పందించి పేదల ఇళ్లకు పట్టాలను ఇవ్వడానికి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 15 రోజుల లోపు పట్టాలు మంజూరు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రామచంద్రన్ హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos