హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలంగాణ నుండి వెళ్లిపోవాలి. ఆమె గవర్నరో, బీజేపీ కార్యకర్తో అర్ధం కావడం లేదన్నా’ని సీపీఐ రాష్ట్రసమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘తమిళిసై తెలంగాణ నుండి వెళ్లిపోవాలి. త్వరలోనే రాజ్ భవన్ ను ముట్టడిస్తాం. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడ గతంలో గవర్నర్ వ్యవస్థలను ఉపయోగించుకొని ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టారు. ప్రస్తుతం కేరళ, తెలంగాణ,ఢిల్లీ రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు అలాఈగే ఉంది. వ్యవస్థను పాలకులు తమకు అనుకూలంగా ఉపయోగించు కుంటురు.ప్రధానికి తెలంగాణపై అనుకోని ప్రేమ పుట్టుకొచ్చింది. దురుద్దేశ్యంతోనే తెలంగాణలో పర్యటిస్తున్నారు. గత ఏడాది ప్రారంభమైన ఫ్యాక్టరీని ఇప్పుడు ప్రారంభించేందుకు రావడం ఏమిటి? మోడీ పర్యటనను అడ్డుకొంటాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ఒక్కటి కూడ నెరవేర్చలేదు. ఈ నెల 10వ తేదీ నుండి సింగరేణి బొగ్గు గనుల్లో ఆందోళనలు చేస్తాం. ప్రధాని రాష్ట్రానికి రావడానికి వీల్లేదని ప్రచారం చేస్తాం. ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్ నిర్వీర్యం చేసింద’ని విమర్శించారు.