అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 6768 మంది శాంపిల్స్ పరీక్షించగా 81 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్యారోగ్యశాఖ అధికారులు బులిటెన్లో వెల్లడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1097కు చేరింది. కరోనా నుంచి కోలుకుని 231 మంది డిశ్చార్జి అయ్యారు. 835 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 31 మంది కరోనాతో మృతి చెందారు.