హైదరాబాద్: తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. 35 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ నెల 19న దుబాయి నుంచి వచ్చిన యువకుడి ద్వారా ఈ వ్యక్తికి కరోనా సోకింది. దీనిపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కు చేరింది. రాష్ట్రంలో రోగి నుంచి మరొకరికి సోకిన కరోనా మొదటి కేసు ఇదే కావడం గమనార్హం.