హోసూరు : కృష్ణగిరి జిల్లా సూలగిరి యూనియన్లో కరోనా నివారణకు గాను చర్యలు చేపట్టారు. సూలగిరి యూనియన్ చైర్పర్సన్ లావణ్య హేమనాథ్ ఆదేశాల మేరకు యూనియన్లోని అన్ని గ్రామాలలో క్రిమి సంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. అదేవిధంగా గ్రామాలలో మురికి నీటి కాల్వల శుభ్రత, తదితర అంశాలపై దృష్టి సారిస్తున్నారు. యూనియన్లోని అన్నిగ్రామాలలో క్రిమిసంహారక మందులు పిచికారీ చేయాలని యూనియన్ చైర్పర్సన్ లావణ్య హేమనాథ్ ఆదేశించడంతో యూనియన్లోని అత్తిముగం గ్రామంలో క్రిమి సంహారక మందులను పిచికారీ చేయించడమే కాక గ్రామంలో అన్ని చోట్లా ఉన్న చెత్త కుప్పలు తొలగించాలని లావణ్య హేమనాథ్ అధికారులకు సూచించారు.