కొత్తిమీర ధరకు రెక్కలు

హొసూరు : హొసూరు ప్రాంతంలో కొత్తిమీర ధరలు ఒక్కసారిగా పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల కొత్తిమీర పంట పలు చోట్ల నాశనమైంది. దీంతో ఒక్క సారిగా ధరలు పెరిగాయి. నెల రోజుల కిందట హొసూరు మార్కెట్‌లో కట్ట కొత్తిమీర రూ.5కు విక్రయిస్తుండగా, ప్రస్తుతం రూ.40కి ఎగబాకింది. మంచి ధర లభిస్తుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos