హస్తం ప్రక్షాళనకు రంగం సిద్ధం

న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తాజా పరిస్థితులకు అనుగుణంగా మరోసారి పార్టీ యంత్రాంగం ప్రక్షాళనకు రంగాన్ని సిద్ధం చేసినట్లు ఏఐసీసీ వర్గాల కథనం. దీని ప్రకారం అన్ని విభాగాల్లోనూ కొత్త ముఖాలకు ప్రాధాన్యత, ప్రాతినిధ్యాన్ని ఇవ్వనున్నారు. జాబితాకు నేత తుది మెరుగులు దిద్దు తున్నారు. బిహార్ ఎన్నికలు ముగియగానే ప్రక్షాళన ఆరంభం కానుంది. ఆయా రాష్ట్రాల బాధ్యుల్ని- ముఖ్యంగా ఢిల్లీ, గోవా బాధ్యులకు ఉద్వాసన అనివార్యం కానుంది. అనుబంధ విభాగాల బాధ్యులూ మారనున్నారు. కేంద్ర ఎన్నికల సమితినీ పునరుద్ధరించనున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నందున పలు రాష్ట్రాల పార్టీ సారథులనూ మార్చదలచారు. అసోం, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గోవా, మణిపూర్, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ మార్పులు జరుగుతాయని మదింపు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos