కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష సోమవారం జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైంది. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. కేంద్రం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆందోళన వ్యక్తం చేసారు. నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుం టున్నారు. జంతర్ మంతర్ వద్దకు రాకుండా బారి కేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులతో కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ నేతల బృందం సోమవారం సాయంత్రం రాష్ట్రపతిని కలవ నున్నా రు. సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, కన్నయ్య కుమార్, మల్లిఖర్జున ఖర్గే, జేడీ శీలం, రణదీప్ సూర్జేవాల, కాంగ్రెస్ ఎంపీలు, ఏఐసీసీ కార్యదర్శులు, రాష్టాల పీసీసీ ప్రెసిడెంట్, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos