ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ

ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ

హోసూరు-రాయకోట రోడ్డులో గల ఆర్ వి పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి హోసూరు ఎమ్మెల్యే ఎస్.ఏ. సత్య భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఆర్ వి ప్రభుత్వ ఉన్నతోన్నత పాఠశాల ప్రహరీ గోడ శిథిలావస్థకు చేరుకోవడంతో పాఠశాల ఉపాధ్యాయులు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై స్పందించిన హోసూరు ఎమ్మెల్యే సత్య ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే నిధుల నుండి రూ.2 లక్షలు కేటాయించారు. భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సత్య హాజరైvపనులను ప్రారంభించారు. తను చదివిన పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే సత్య తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు డిఎంకె పార్టీ నాయకుడు యువరాజ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos