ముంబై: మార్కెట్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. ఆరంభంలో స్వల్ప నష్టాలతో మొదలై మధ్యాహ్నం అయ్యే కొద్దీ భారీ నష్టాల్లోకి జారిపోయాయి. సెన్సెక్స్ ఏకంగా 642 పాయింట్లు దిగజారి 36,481 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 186 పాయింట్ల నష్టంతో 10,818 వద్ద ఆగింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ. 71.86గా దాఖలైంది. ఆటో, బ్యాంకింగ్, లోహ, మౌలిక, ఐటీ, ఫార్మా ఇలా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ముగిసాయి.