పాట్నా: పౌరసత్వ చట్ట సవరణ ముసాయిదాకు జేడీయూ మద్దతు పలకడం తనను నిరాశకు గురి చేసిందని ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. మతం ప్రాతిపదికన వలసదారులకు పౌరసత్వాన్ని కల్పించే ఈ ముసాయిదా పౌరసత్వ హక్కుకు తూట్లు పొడిచిందన్నారు. గాంధేయవాద ఆదర్శాలతో రూపొందించిన పార్టీ రాజ్యాంగంలోని మొదటి పేజీ లోనే మూడు సార్లు లౌకికవాదం అనే పదం ఉందన్నారు. లౌకికవాద రాజకీయ పక్షం ఈ ముసాయిదాకు మద్దతు పలక డం నిరా శకు గురి చేసిందని మంగళ వారం ట్వీట్ చేశారు. గత ఎన్నికల్లో వైకాపా ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నారు. జేడీయూ సభ్యుడైన ఆయన సొంత పార్టీ నిర్ణ యాన్నే విమర్శిం చారు.