హైదరాబాద్ : తెలంగాణ వరప్రదాయినిగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు సినీ తారలు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. నాగార్జున, రవితేజలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. నీరే ప్రపంచానికి జీవం. ప్రపంచంలో అతి పెద్ద ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినందుకు శుభాకాంక్షలు, కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల అద్భుత ప్రతిభకు నిదర్శనం అని నాగార్జున ట్వీట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం. ఇంత గొప్పప్రాజెక్టును నిర్మించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్లకు అభినందనలు అని రవి తేజ ట్వీట్ చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు ఫొటోను షేర్ చేశారు.