‘శభాష్ రా చిరంజీవీ’ అనేవారు

  • In Film
  • October 6, 2019
  • 157 Views
‘శభాష్ రా చిరంజీవీ’ అనేవారు

తాను తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చే సమయానికే ఎస్వీ రంగారావు దూరమయ్యారని, ఇప్పుడు ఆయనే బతికి ఉండివుంటే, ‘సైరా’ చిత్రాన్ని చూసి ‘శభాష్ రా చిరంజీవి’ అని ప్రశంసించేవారని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం తాడేపల్లి గూడెంలో దివంగత నటుడు ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మెగాస్టార్ మాట్లాడారు. పైన ఎక్కడున్నా ఆ మహానటుడు తమ ప్రయత్నాన్ని దీవిస్తారనే నమ్ముతున్నానని అన్నారు.ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని తనను గంటా శ్రీనివాస్, ఈలి నాని తదితరులు గతంలోనే కోరారని, అయితే, అన్ని అనుమతులూ వచ్చేసరికి ఇంత సమయం పట్టిందని అన్నారు. తన ఫ్యాన్స్ చూపే అభిమానమే తనను ఇంతవాడిని చేసిందని వ్యాఖ్యానించిన చిరంజీవి, భవిష్యత్తులో అభిమానులు మెచ్చే మరిన్ని చిత్రాలను చేయడమే లక్ష్యమన్నారు. తొమ్మిది అడుగులా 3 అంగుళాల ఎత్తున్న ఈ విగ్రహాన్ని చూస్తుంటే తన మనసు ఉప్పొంగుతోందని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos