చైనాతో చర్చలు విఫలం

చైనాతో చర్చలు విఫలం

న్యూ ఢిల్లీ : చైనా – భారత్ మధ్య 13వ విడత చర్చలు విఫలమయ్యాయి. చైనా ఉన్నతాధికారులు భారత షరతులకు ఒప్పుకోవట్లేదని భారత ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు. పరిష్కారం జరగని మిగతా ప్రాంతాలపై భారత్ నిర్మాణాత్మక సూచనలను చేసినా చైనా వినిపించుకోలేదని, వాటికి అంగీకరించలేదని తెలిపారు. దీంతో ఎలాంటి ప్రయోజనం లేకుండానే చర్చలు ముగిశాయన్నారు. సమాచార మార్పిడి, సరిహద్దుల్లో స్థిరత్వానికి ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రొటో కాల్స్ కు లోబడి మిగతా ప్రాంతాల్లోని సమస్యలను త్వరలోనే పరిష్కరించుకుంటామని చెప్పారు. చైనా కూడా చర్చలు విఫలమైనట్టు ప్రకటించింది. హేతుబద్ధం కాని సత్య దూరమైన డిమాండ్లను భారత్ పెడుతోందని తెలిపింది. అందువల్లే చర్చలు సజావుగా సాగట్లేదని పేర్కొంది. సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణాన్ని తగ్గించేందుకు తాము నిజా యితీగా పని చేశామని చెప్పింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos