న్యూఢిల్లీ: తనపై విధించిన బెయిల్ షరతులను సవరించాలని భీం ఆర్మీ ఛీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ శనివారం ఇక్కడ ఉన్నత న్యాయ స్థానానికి మొర పెట్టుకున్నారు. అనుమతి లేకుండా డిసెంబర్ 20న ఢిల్లీలోని జామా మసీదులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పాల్గొన్నారనే ఆరోపణపై ఆయన్ను పోలీసులు అరెస్టు చేసారు. ఇటీవల న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరుగుతు న్నందున నాలుగు వారాల పాటు ఢిల్లీకి దూరంగా ఉండాలనే కూడా వాటిలో ఒకటి.