ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రయాణికుల వాహన విక్రయాలు నిరుడు ఇదే వ్యవధితో పోలిస్తే 17 శాతం పెరిగాయి. 7,26,232 ప్రయాణికుల వాహనాలు విక్రయమయ్యాయి. నిరుడు ఇదే సమయంలో వీటి సంఖ్య 6,20,620. 46,90,565 ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. నిరుడ ఇదే వ్యవధిలో వాటి సంఖ్య 46,82,571. వాణిజ్య వాహనాల విక్రయాలు 20.13 శాతం క్షీణించి 1,33,524 యూనిట్లకు పరిమితమయ్యాయి.