కరోనా అంతమవుతుందని అనుకోవద్దు

కరోనా అంతమవుతుందని అనుకోవద్దు

జెనీవా: కరోనా ఇప్పుడప్పుడే అంతమవుతుందన్న ఆలోచనలు సరికాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోం ఘెబ్రియేసస్ సూచించారు. మరిన్ని రకాలు పుట్టుకొచ్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. సంస్థ పాలక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒమిక్రాన్ 9 వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. కొత్త రకాల కేసుల సంఖ్య 2020లో నమోదైన మొత్తం కేసుల కన్నా ఎక్కువని చెప్పారు. గత వారం సగటున ప్రతి మూడు క్షణాలకు 100 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రతి 12 సెకన్లకు ఓ ప్రాణం కరోనాకు బలైందన్నారు. కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా మరణాలు మాత్రం అంతగా లేవన్నారు. టీకాలు ఇంకా అందని ఆఫ్రికా వంటి దేశాల్లో మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణకు అదిఏర్పడిన పరిస్థితులను మార్చాలని సూచించారు. వైరస్ ఎప్పుడు ఎలా మారుతోందో అంచనా వేయడం కష్టమన్నారు. కొన్ని దేశాల్లో ఒమిక్రాన్ కేసులు తగ్గుముఖం పట్టాయని, అయితే, చాలా దేశాల్లో ఇంకా వ్యాప్తి ప్రబలంగానే ఉందని తెలిపారు. కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాల్లోనే కొత్త రకాలు ఉద్భవించే ముప్పుందని హెచ్చరించారు. సరైన చర్యలు తీసుకుంటే ఈ ఏడాదే మహమ్మారిని అంత్యదశకు తీసుకురావొచ్చునని ఆశించారు. అందుకు అన్ని దేశాలూ సంస్థ వో వ్యూహాలను అమలు చేయాలన్నారు. అన్ని దేశాల్లో కరోనా పరీక్షలను పెంచాలని, టీకాల్ని మరింత వేగవంతంగా వేయాలని, ఆక్సిజన్, యాంటీ వైరల్ ఔషధాలను అందరికీ సమానంగా అందించాలన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos