మ‌ళ్లీ 10 వేల‌కు పైగా కొత్త క‌రోనా కేసులు

మ‌ళ్లీ 10 వేల‌కు పైగా కొత్త క‌రోనా కేసులు

న్యూ ఢిల్లీ : దేశంలో మళ్లీ కొత్తగా 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం 10,549 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలి పింది ఒక్క రోజులో కరోనాతో 488 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి మరో 9,868 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 1,10,133 మంది చికి త్స తీసుకుంటున్నారు. మొత్తం కేసుల సంఖ్య 3,45,55,431కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 3,39,77,830 మంది కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 4,67,468కి చేరింది. మొత్తం 63,71,06,009 కరోనా పరీక్షలు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos