సాహో సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రియాలో జరుగుతోంది. మధ్యలో విరామం దొరకడంతో ప్రభాస్, శ్రద్ధ, ఇతర సిబ్బంది కేబుల్ రైడ్కు ఉపక్రమించారు. చిత్ర బృందంతో ఉన్న ఫొటోలను శ్రద్ధా కపూర్ కేశాలంకరణ చూసే నికితా మేనన్ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. ఈ షెడ్యూల్తో షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లేనని భావిస్తున్నారు. సుజీత్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్కు విశేష స్పందన లభించింది. స్టంట్స్, డైలాగ్స్, యాక్షన్ దృశ్యాలు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.