బుర్ఖా నిషేధించ రాదు

బుర్ఖా నిషేధించ రాదు

న్యూ ఢిల్లీ : ముస్లిమ్ మహిళలు బుర్ఖా ధరించకుండా నిషేధించాలని శివసేన పార్టీ చేసిన డిమాండు ను కేంద్రమంత్రి రాందాస్ అథవాలే బుధవారం ఆక్షేపించారు.. బుర్ఖాలు ధరించిన మహిళలందరూ ఉగ్రవాదులు కాదని చెప్పారు. బుర్ఖా ధరించిన వారు ఉగ్రవాదులైతే వారి బుర్ఖాను తొలగించాల్సిందేనని పేర్కొన్నారు. భారతదేశంలో ముస్లిమ్ మహిళలు బుర్ఖా ధరించడం సంప్రదాయమని, అది వారి హక్కు అని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో బుర్ఖాపై నిషేధం విధించరాదని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos