మైనర్‌ బాలికపై లైంగిక వేధింపులు.. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు

మైనర్‌ బాలికపై లైంగిక వేధింపులు.. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పపై లైంగిక వేధింపుల కేసు నమోదయింది. ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. 17 ఏండ్ల బాలిక తల్లి ఫిర్యాదుతో బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 2న ఓ చీటింగ్ కేసులో సహాయం కోరేందుకు తన 17 ఏండ్ల కుమార్తెతో కలిసి యడియూరప్ప దగ్గరకు వెళ్లామని, ఆ సమయంలో లైంగిక దాడి జరిగనట్లు బాలిక తల్లి అందులో పేర్కొన్నారు. అయితే ఈ విషయమై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఇప్పటివరకు స్పందిచంలేదు. లోక్సభ ఎన్నికలకు ముందు ఆయనపై ఈ ఆరోపణలు రావడం సర్వత్రా చర్చ జరుగుతున్నది. 2008-2011 మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2018లో కొద్ది రోజుల పాటు, ఆ తర్వాత జూలై 2019-2021 మధ్య మరోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2021, జులైలో బీజేపీ అధిష్టానం యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించింది. ప్రస్తుతం ఆయన కుమారుడు విజయేంద్ర యడియూరప్ప రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos