అల్లర్ల సృష్టికి బాబు కుతంత్రం

అల్లర్ల సృష్టికి బాబు కుతంత్రం

అమరావతి: రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం చంద్ర బాబు నాయుడు ఇష్టం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గురు వారం తాడే పల్లిలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం ప్రశాంతంగా, శాంతి భద్రతలకు ఢోకా లేకపోవటాన్ని చంద్రబాబు తట్టుకోలేక చౌకబారు ఎత్తుగడలకు పాల్ప డుతున్నారని తప్పుబట్టారు. ఇలా చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా అభివర్ణించారు. శాంతి భద్రతల సమస్యలను సృష్టించేందుకు చంద్ర బాబు నాయుడు, తెదేపా నేతలు యత్నిస్తున్నారని ఆరోపించారు. అలాంటి ప్రయత్నాల్ని విరమించుకోవాలని హితవు పలికారు. శాంతి భద్రతల ని యం త్రణలో పోలీసులు చక్కగా పని చేశారని ప్రశంసించారు. వంద రోజుల పాలనలో కొత్త ఆలోచనలతో జగన్ ముందుకు సాగుతుండగా చంద్రబాబు మాత్రం తన పాత విధానాలు, కుట్రలతోనే గడప దలచారని ధ్వజ మెత్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos