ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

న్యూఢిల్లీ: ఇక్కడి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు ఉన్నట్లు సోమవారం ఉదయం బెదిరింపు కాల్ రాకవడంతో అధికారులు అప్రమత్త మయ్యారు. ‘ఉదయం 7.45 గంటలకు ఢిల్లీ నుంచి పాట్నాకు ప్రయాణిస్తున్న విమానం లోపల బాంబు ఉందని ఓ అగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో వెంటనే అన్ని సంబంధిత ఏజెన్సీలకు సమాచారం ఇచ్చినట్లు’ ’డీసీపీ (విమానాశ్రయం) రాజీవ్ రంజన్ పేర్కొన్నారు. విమానంలో ఉన్న సుమారు 52 మంది ప్రయా ణికులను మరో విమానానికి తరలించి విస్తృత తనిఖీలు నిర్వహించారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని ఆకాష్ దీప్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తన కొడుకు మానసిక స్థితి స్థిరంగా లేదని, అతడు విమానంలో కూర్చున్నప్పుడు తన ఫోన్ నుంచి కాల్ చేశాడని ఆకాష్ దీప్ తండ్రి పోలీసులకు చెప్పినట్లు డీసీపీ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos