దీపికకు మరో తలనొప్పి..

దీపికకు మరో తలనొప్పి..

బాలీవుడ్ హీరోయిన్​ దీపికా పదుకొణె మేనేజర్​ కరిష్మా ప్రకాశ్​కు నార్కోట్రిక్స్​ కంట్రోల్​ బ్యూరో మరోసారి సమన్లు జారీ చేసింది. మంగళవారం ఆమె ఇంటిపై సోదాలు నిర్వహించిన ఎన్సీబీ.. డ్రగ్స్​ను స్వాధీనం చేసుకుంది. దాడులలో 1.8 గ్రాముల నిషేధిత మాదక ద్రవ్యాలు లభించినట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖేడే వెల్లడించారు.కాగా ప్రస్తుతం కరీష్మా పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం విచారణకు హాజరుకావల్సిందిగా సమన్లు జారీ చేశారు అధికారులు. కాగా యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు బాలీవుడ్ వర్గాలను కుదిపేస్తున్నాయి. నెపోటిజం ఇష్యూ మొదలుకొని డ్రగ్స్ ఆరోపణల వరకూ బయటకొస్తున్న అన్ని విషయాలు బీ టౌన్ వర్గాలను వణికిస్తున్నాయి. బడా హీరోలుహీరోయిన్లు, దర్శకనిర్మాతలపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తుండటం ప్రకంపనలు సృష్టిస్తోంది.కాగా పెను సంచలనంగా మారిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ‘ఊపిరి’ ఫేమ్ గాబ్రియెల్లా డెమెట్రియేడ్ సోదరుడుని అరెస్ట్ చేసారు. అలానే నటి సప్నా పబ్బాకు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. ఇప్పుడు కరిష్మా ప్రకాష్ కు మరోసారి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు నోటీసులు ఇవ్వడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.ఇప్పటికే సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకోగా.. స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్‌ప్రీత్ సింగ్ తదితురులను విచారించిన ఎన్‌సీబీ అధికారులు వారి మొబైల్స్ ను స్వాధీన పర్చుకున్న విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos