ద్విచక్ర వాహనాల ఢీ : ఒకరి మృతి

హొసూరు : ఇక్కడికి సమీపంలో శుక్రవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హొసూరు-డెంకణీకోట రోడ్డులోని బెన్నంగురు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో కృష్ణగిరి సమీపంలోని పాంచాలి గ్రామానికి చెందిన మోహన్ అక్కడికక్కడే మరణించాడు. మోహన్ నడుపుతున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో

ముగ్గురు యువకులు గాయపడ్డారు. ఈ దృశ్యాలు సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద అమర్చిన సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos