హైదరాబాదు: తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి భార్య నారా భువనేశ్వరి శుక్రవారం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. తనకు జరిగిన అవమానాన్ని కొందరు వారి తల్లికి, తోబుట్టువుకు, కూతురికి జరిగినట్టుగా భావించి తనకు అండగా నిలబడ్డారని చెప్పారు. తన జీవితంలో వారి ప్రేమను మర్చిపోలేనని పేర్కొన్నారు. తమను చిన్నతనం నుంచి అమ్మ, నాన్న విలువలతో పెంచారని భువనేశ్వరి చెప్పారు.ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, వారి గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని భువనేశ్వరి అన్నారు. తనకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశించారు.