అడ్డంకుల్ని దాటి అభిమానులకు చేరువైన ప్రియాంక

అడ్డంకుల్ని దాటి అభిమానులకు చేరువైన  ప్రియాంక

రత్లామ్(మధ్యప్రదేశ్): కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోమవారం ఇక్కడ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బారికేడ్లను దాటు కొని పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, ప్రజలున్న వైపునకు దూకినవీడియో సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా సంచరిస్తోంది. ప్రియాంకను అనివార్యంగా ఆమె భద్రతా సిబ్బంది అనుసరించి రక్షణ కల్పించారు. వాళ్లు అక్కడకు చేరుకునే సరికే ప్రియాంక అక్కడివారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవటంతో పాటు సెల్ఫీలు దిగారు. తన రక్షణ గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా ఇలా ప్రజల మధ్యలోకి వెళ్లి కలిసిపోవడం ప్రియాంకకు కొత్తేమీ కాదు. మే 12న దిల్లీలో ఓటు వేసిన వస్తున్నపుడు రోడ్డు పక్కన మంచం మీద కూర్చున్న ఒక వృద్ధురాలి వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఓటు వేసి, తమ సిరా గుర్తును చూపిస్తోన్న ఇద్దరు యువతులతో కలిసి ఫొటోకు పొజిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos