వాటికి వాణిజ్య ప్రకటనలు ఇవ్వం

వాటికి వాణిజ్య ప్రకటనలు ఇవ్వం

ముంబై: ‘విషపూరిత సమాచారాన్ని కంటెంట్ను ప్రసారం చేసే న్యూస్ ఛానెళ్లకు ఇకపై ప్రకటనలు ఇవ్వబోమని పార్లీ ప్రొడక్ట్స్, బజాజ్ సహా పలు బ్రాండెడ్ సంస్థలు సోమవారం ఇక్కడ వెల్లడించాయి. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ సంస్థలపై ప్రత్యేకించి పార్లీపై ప్రశంసలు కురుస్తున్నాయి. పుకార్లు, విద్వేషపూరిత వార్తలతో పాటు టీఆర్పీ ట్యాంపరింగ్కు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూస్ ఛానెళ్లను కీలక ప్రకటనదారులు, మీడియా ఏజెన్సీలు ఇప్పటికే నిశితంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. రిపబ్లిక్ టీవీ సహా కొన్ని ఛానెళ్లు టీఆర్పీ-ఫిక్సింగ్కు పాల్పడినట్టు బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) నుంచి ఫిర్యాదు అందిందనీ, దీనిపై విచారణ చేపట్టామని ముంబై పోలీసులు వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos