భాజపాలో బాబు జనాల పార్టీ వేరు

భాజపాలో బాబు జనాల పార్టీ వేరు

అమరావతి : ’అవినీతి మీద చంద్రబాబు నాయుడు, ఆకలి మీద లోకేష్ నాయుడు, ఇసుక అక్రమాల మీద అచ్చెం నాయుడు, మహిళా రక్షణ మీద చింతమనేని, సంస్కారం మీద ఉమా, స్పీకర్ పదవి ఔన్నత్యం మీద యనమల లెక్చర్ ఇస్తే ఎలా ఉంటుందో. బ్యాంకు లూటీల భజనా చౌదరి రాష్ట్ర ప్రయోజనాల గురించి విలేఖరుల సమావేశాల్ని నిర్వహిస్తే అలాగే ఉంటుంది’ వైకాపా నేత విజయసాయిరెడ్డి శుక్రవారం ట్విట్టర్లో ఎద్దేవా చేశారు. ‘ఈసారి సుజనా చౌదరి విలేకర్లకు బదులుగా తాను రూ. వేల కోట్ల మేర ముంచేసిన అర డజను బ్యాంకుల అధికారుల్ని ఎదుట కూర్చోపెట్టి వారి ప్రశ్నలకు బదులిస్తే . ఆయన పార్టీ ఎందుకు మారాడో, చంద్ర బాబు ఆయనను ఎందుకు పార్టీ మార్చాడో అన్నీ అర్ధమవుతాయ’ని చురకలేసారు. ’సుజనా వారి మాయా సామ్రాజ్యం మీద ఒకప్పుడు మొదటి పేజీలో వరస కథనాలతో మోతెక్కించిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు సుజనా చౌదరిని జస్టిస్ చౌదరిగా చూపించేందుకు గురువారం విలేఖరుల సమావేశారింర లైవ్లో, లైవ్ స్ట్రీమింగ్లో మోతెక్కించింది. దీనికి కారణం ప్రజా ప్రయోజనమా? లేక పబ్లిక్గా తెలిసిపోయిన ఇంట్రెస్టా?’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సుజనా చౌదరి పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే భాజపా వేరు అందులోని బాబు జనాల పార్టీ వేరు అని అందరికీ మరోసారి బాగా అర్థమైందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos