కోహ్లీకి ఐసీసీ అవార్డుల పంట

కోహ్లీకి ఐసీసీ అవార్డుల పంట

దిల్లీ: భారత్ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ అవార్డులను క్లీన్‌స్వీప్‌ చేశాడు. ఐసీసీ ప్రకటించిన సర్‌ గార్‌ఫీల్డ్‌‌ సోబెర్స్‌‌ ట్రోఫీ ఫర్‌ ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌, ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌, ఐసీసీ వన్డే క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌.. ఈ మూడు అవార్డులను గెలుచుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ సెంచరీల వీరుడు 2018లో 13 టెస్టు మ్యాచుల్లో.. 55.08 సగటుతో 1322 పరుగులు చేశాడు. వాటిలో ఐదు శతకాలున్నాయి. 14 వన్డే మ్యాచుల్లో.. 133.55 సగటుతో 1202 పరుగులు సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ వరుసగా రెండో ఏడాది వన్డే క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌, క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌లను గెల్చుకోగా, మొదటి సారి టెస్టు క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. ‘2018లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ చూపిన అద్భుత ప్రదర్శనకు గాను ఐసీసీ టెస్టు, వన్డే జట్టులకు కెప్టెన్‌గా అతని పేరును ప్రకటించాం’ అని ఐసీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. పరుగుల పరంగానే కాకుండా 2018లో టీమిండియాను విజయపథంలో నడిపిన తీరుకు రివార్డు దక్కింది. 71 ఏళ్లలో ఆస్ట్రేలియా గడ్డ మీద టెస్టు సిరీస్‌ను గెలుచుకోవడంతో పాటు, వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచి టీమిండియా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్.. ఎమర్జింగ్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్‌, ఆస్ట్రేలియన్ క్రికెటర్‌ ఆరోన్‌ ఫించ్.. ఐసీసీ టీ20 ఫెర్ఫార్మెన్స్‌‌ ఆఫ్ ది ఇయర్‌ 2018, కేన్‌ విలియమ్సన్‌.. ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్‌, శ్రీలంక అంపైర్‌ ధర్మసేన.. డేవిడ్ షెఫర్డ్ ట్రోఫీ, స్కాలాండ్‌కు చెందిన కాలమ్ మెక్‌లీయోడ్.. ఐసీసీ అసోసియేట్ క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌ 2018 అవార్డులను గెలుచుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos