న్యూఢిల్లీ : రోజుల తరబడి నగదు నింపకుండా ఏటీఎంలను ఖాళీగా ఉంచే బ్యాంకులు జరిమానా విధించనున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు హెచ్చరించింది. మూడు గంటలకు మించి ఏటీఎంలు నగదు లేకుండా ఉండరాదని తేల్చి చెప్పింది. చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎంల్లో నగదు లేకపోవడంతో గంటల కొద్దీ ఖాతాదారులు నిరీక్షించటం సర్వ సాధారణమైంది. కొన్ని చోట్ల ఏటీఎంల్లో రోజుల తరబడి నగదు నింపకపోవడంతో పరిపాటైంది. . ఏటీఎంల లోని సెన్సర్ల ద్వారా వాటి నగదు నిల్వ వివరాలు ఆయా బ్యాంక్లకు ఎప్పటి కప్పుడు తెలుస్తాయి. అయినప్పటికీ ఏటీఎంలలో నగదును నింపేందుకు బ్యాంకులు నిర్లక్ష్యం వహిస్తున్నాయి.