అతిషికి ఈసీ నోటీసులు

అతిషికి ఈసీ నోటీసులు

న్యూ ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి అతిషికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీలో చేరాలని లేదంటే ఈడీని ఎదుర్కోవాల్సి ఉంటుందని కొందరు వ్యక్తులు తనను సంప్రదించారని అతిషి ఇటీవలే ఆరోపించిన విషయం తెలిసిందే. అతిషి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ తాజాగా స్పందించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం అతిషికి నోటీసులు పంపింది. ఏప్రిల్ 8 మధ్యాహ్నం 12 గంటలలోపు నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. బీజేపీలో చేరాలని, లేదంటే అరెస్టు తప్పదనని ఓ కాషాయ పార్టీ నేత తనను అడిగినట్లు మంత్రి అతిషి ఆరోపించిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తనతో పాటు మరో ముగ్గురు ఆప్ వ్యక్తులను త్వరలోనే అరెస్టు చేస్తారని ఆమె అన్నారు. ఈడీ అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే బీజేపీలో చేరాలని ఓ వ్యక్తి ఆశ్రయించినట్లు ఆమె చెప్పారు. అతిషి ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు ఆమెకు పరువునష్టం నోటీసు జారీ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos