ఆశా ప‌రేఖ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

ఆశా ప‌రేఖ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

న్యూ ఢిల్లీ : బాలీవుడ్ సీనియర్ నటి ఆశా పరేఖ్ 2020 ఏడాది దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ మంగళవారం ఇక్కడ తెలిపింది. 68వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఈ నెల 30న ఫాల్కే అవార్డును ఆమెకు ప్రదానం చేయనున్నారు. 1942 అక్టోబర్ 3న గుజరాతీ కుటుంబంలో జన్మించిన ఆమె బాల్యంలోనే శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నారు. 1952లో వచ్చిన ‘మా’ తో బాలనటిగా చిత్ర సీమలో అడుగుపెట్టారు. ఆ చిత్రంతోనే ఆమెకు మంచి గుర్తింపు లభించింది. 1959లో విడుదలైన ‘దిల్ దేకే దేఖో’ చిత్రంతో ఆమె హీరోయిన్గా మారారు. కటీ పతంగ్, మేరా గావ్ మేరా దేశ్, తీర్సీ మంజిల్ వంటి చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos