ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ పౌరులు ఐదుగురిని చైనా సైనికులు అపహరించారనే ఆరోపణలపై చైనా కు భారత సైనికాధికారులు హాట్లైన్ మెసేజ్ పంపినట్లు కేంద్ర మంత్రి రిజుజా సోమవారం ట్వీట్ చేసారు. చైనా, భారత్ సరిహద్దుల్లోని ఎగువ సుభాన్సిరి జిల్లాలో వేటకు వెళ్లిన ఐదుగురిని చైనా సైనికులు అపహరించారని స్థానిక శాసనసభ్యుడు ఆరోపించారు. పోలీసులు నిజానిజాలు తెలుసుకుంటుండగా పీటీఐ వార్తా సంస్థ అపహరణకు గురైన ఐదుగురి పేర్లను వెల్లడించింది. మొత్తం ఏడుగురు పౌరుల్లో ఇద్దరు తప్పించుకున్నారని, ఐదుగురు చైనా సైనికులు పట్టుకున్నారని తెలిపింది.