జమ్ము కశ్మీర్కు ప్రత్యేక హోదా తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ నటి మహీరాఖాన్ సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.”మేము పరిష్కరించడానికి ఇష్టపడని వాటిని సౌకర్యవంతంగా నిరోధించారా? ఇది ఇసుక మీద గీసిన గీతలకు మించినది, ఇది అమాయక ప్రాణాలను కోల్పోవడం గురించి స్వర్గం మండుతోంది …మేం నిశ్శబ్దంగా రోదిస్తున్నాం” అంటూ రాసుకొచ్చింది.మహీరా ట్వీట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. కొందరు పరోక్షంగా మహీరాపై విమర్శలు గుప్పిస్తుంటే మరికొందరు నేరుగానే తిట్టిపోస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ బలూచిస్థాన్, సింధ్ ఎంత అభివృద్ధి చెందాయి? దీనికోసం మీ గుండె ఎందుకు కాలిపోవడం లేదని ఓ నెటిజన్ ప్రశ్నించారు. ”కాశ్మీర్ మాది, మా ప్రభుత్వం శాంతిని కాపాడేందుకు ఈ చర్య తీసుకుంది..మా కశ్మీర్ విషయంలో మేం ఏమైనా చేస్తాం, కాశ్మీర్ ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది” అంటూ మరో నెటిజన్ మహీరా మాటలకు ఘాటుగా బదులిచ్చాడు.