కవితపై అర్వింద్ పిటిషన్

కవితపై  అర్వింద్ పిటిషన్

హైదరాబాదు: ‘టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తనను చంపుతానని మీడియా ముఖంగా వార్నింగ్ ఇచ్చింది. ఆమెపై చర్యలు తీసుకోవాల’ని కోరుతూ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలంగాణ హైకోర్టులో మంగళవారం పిటిషన్ వేశారు. హైదరాబాద్ లో ఉన్న తన ఇంటిపై కూడా టీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులను అవమానించిన కవితపై, ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశాలను జారీ చేయాలని కోరారు. పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇటీవల అర్వింద్ పై కవిత విలేఖరుల సమావేశంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో తాను మాట్లాడానని అర్వింద్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో అర్వింద్ ను చెప్పుతో కొడతానని హెచ్చరించారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే కొట్టి చంపుతామని వార్నింగ్ ఇచ్చారు. అర్వింద్ ఎక్కడి నుంచి పోటీ చేసినా వెంటాడి ఓడిస్తానని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos