నలుగురు తల్లుల కడుపు కోత పట్టదా?

నలుగురు తల్లుల కడుపు కోత పట్టదా?

న్యూ ఢిల్లీ : ఏడేళ్ల న్యాయ పోరాటం తర్వాత నిర్భయకు న్యాయం జరిగిందంటూ దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంటే దోషుల తరఫు లాయర్ అజయ్ ప్రకాశ్ సింగ్(ఏపీ సింగ్) స్థానికుల తీరుపై ఆగ్రహించారు. దోషుల తల్లుల కడుపు కోతను వేడుక చేసుకుంటారాని మండిపడ్డారు. ‘ ఒక తల్లి కోసం ఇంతమంది ముందుకు వచ్చారు. మరి ఆ తల్లి తన కూతురు అర్ధరాత్రులు ఎక్కడ తిరుగుతుందో ఎందుకు పట్టించుకోలేదు. ఎవరితో ఎటువంటి పరిస్థితుల్లో ఉందో ఎందుకు తెలుసుకోలేద’ని తప్పుబట్టారు. దోషుల తల్లులూ కొడుకులనూ నవ మాసాలు మోసి కన్నారు.వారికి బాధ ఉండదాని అక్కసును వెళ్లగక్కారు. మరో రెండు మూడు రోజుల పాటు ఉరిశిక్ష వాయిదా వేయించడానికి ప్రయత్నించానన్నారు. ఉరి తీయకుండా సరిహద్దుకు పంపాలనీ కోరినట్లు చెప్పారు. ఆయన వ్యాఖ్యలు పితృస్వామ్య భావజాలానికి అద్దం పడుతున్నాయి. వెంటనే క్షమాపణ చెప్పాలని మహిళా సంఘాలు డిమాండ్ చేసాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos