మండలి చైర్మన్‌గా మోషేన్ రాజు

మండలి చైర్మన్‌గా మోషేన్ రాజు

అమరావతి: ఏపీ శాసనమండలి ఛైర్మన్‌గా కొయ్యే మోషేన్‌ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఆయనను చైర్మన్‌ స్థానం వద్దకు తీసుకొచ్చిన సీఎం వైఎస్ జగన్..  శుభాకాంక్షలు తెలిపారు. మోషేన్‌ రాజు నిబద్ధత గల రాజకీయ నాయకుడు అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా మోషేన్‌ రాజుకు మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు.
వైఎస్సార్ కుటుంబం ఎంతో మంది సామాన్యులను ఉన్నత స్థాయికి తీసుకొచ్చిందని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సీఎం జగన్ సముచిత స్థానం కల్పిస్తున్నారని మోషేన్‌ రాజు అన్నారు. దళితుడిని ఉన్నతస్థాయిలో కూర్చోబెట్టిన ఘనత సీఎం జగన్‌దేనని ఆయన పేర్కొన్నారు. ఈ స్థాయికి వస్తానని అనుకోలేదు. ఎప్పుడూ వైఎస్సార్ కుటుంబంతో ఉండేందుకు ఇష్టపడతానన్నారు. రాజకీయాలకు కులం, డబ్బు అవసరం లేదు. ప్రజల విశ్వాసం ఉంటే చాలని నమ్మిన నాయకుడు వైఎస్ జగన్ అని మోషేన్ రాజు అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos