మరొకరికి కరోనా

మరొకరికి  కరోనా

అమరావతి: రాష్ట్రంలో మరొకరికి కరోనా సోకింది. విశాఖకు చెందిన కరోనా వ్యాధి గ్రస్థుడి రోగి బంధువు ఆ వ్యాధికి గురయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ శుక్కవారం ఇక్కడ వెల్లడించింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 12కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 384 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 317 మందికి వ్యాధి లేనట్లు తేలింది. మరో 55 మంది ఫలితాలు రావాల్సి ఉంది.తిరుపతిలో ఇద్దరు స్విమ్స్ వైద్యులకు కరోనా వైరస్ లక్షణాలు ఉండటంతో వారి నమూ నాలు సేకరించి క్వారంటైన్కు పంపారు. కరోనా పాజిటివ్ ఉన్న హైదరాబాద్ వైద్యుల్ని వీరు కలిసినట్లు సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos