ప్రాంతీయపార్టీల రచయిత అన్నాదొరై 110వ జయంతి వేడుకలను తమిళనాడంతటా ఘనంగా జరుపుకొన్నారు. ఆదివారం అధికార అన్నాడిఎంకెపార్టీ, డిఎంకె పార్టీ లు పోటీ పోటీగా జయంతి వేడుకలను జరిపారు. హొసూరు లో డీఎంకే నేత ఎన్. ఎస్. మాదేశ్వరన్ అధ్యక్షతన తాలూకాపీసు వద్ధ అన్నా విగ్రహనికి పూలమాల లు వేసి నివాళులర్పించారు.అన్నాదొరై సేవలు చిరస్మరనీయమని కొనియాడారు. రామాంజిరెడ్డి, సుకుమార్, తదితరులు కలుసుకొన్నారు.అన్నా డీఎంకే నాయకులు సూళగిరి మాజీచైర్మెన్ మదు నేతృత్వంలో సూళగిరి లోఅన్నాదొరై చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.