నెల్లూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘‘వైసీపీ ప్రభుత్వాన్ని పీకేసేంత సత్తా నీకు లేదని తెలుసుకో పీకే. పీకే నవ్వు ఏమీ పీకలేవ్.. నువ్వు చంద్రబాబు దత్తపుత్రుడివని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు యాక్షన్ అనగానే ఓ ప్రెస్ మీట్ పెట్టడం అలవాటే. మీరందరూ కట్టకట్టుకుని వచ్చినా 2024లో విజయం వైసీపీ దే. 2024 ఎన్నికలలో విజయం సాధించి ప్రతిపక్షమే లేకుండా చేస్తాం. అందరూ కట్టకుని రండి. సినిమాలతో పాటు చంద్రబాబు స్ర్కిప్ట్లకు కూడా నటించే నిన్ను జనం నమ్మరు. ముందు నువ్వు పోటీ చేసే సీటు గెలిచేందుకు ప్రయత్నించు’’ అని వ్యాఖ్యానించారు. అభిమానులు పవన్ కళ్యాణ్ వెంట తిరగడం మానుకోవాలన్నారు. ఆయన సీఎం అవ్వడం ఓ కలగానే మిగిలిపోతుందన్నారు. ముందు అసెంబ్లీలో అడుగుపెట్టడం చూసుకోవాలన్నారు. పవన్ కోసం తిరిగితే పెట్రోలు, డబ్బులు బొక్క, చెమట బొట్టు కూడా బొక్కే అన్నారు.