చట్టాల రద్దుతో ఎన్నికల్లో భాజపాకు ప్రయోజనం శూన్యం!

చట్టాల రద్దుతో ఎన్నికల్లో భాజపాకు ప్రయోజనం శూన్యం!

న్యూ ఢిల్లీ : మూడు సాగు చట్టాలను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజకీయ కోణంతో తీసుకున్నది కావటంతో రైతుల ఆందోళన ఆగిపోదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు ఎలాంటి ప్రయోజనం చేకూరదని వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు, శెత్కారీ సంఘటన అధ్యక్షుడు అనిల్ ఘన్వాట్ జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల వరకు నిరసన కొనసాగించాలని రైతులు నిర్ణయించుకున్నారని చెప్పారు. ఆందోళన తార స్థాయికి చేరినప్పుడు స్పందించని కేంద్రం, ఇప్పుడు వారికి తల వంచిందని వ్యాఖ్యానించారు. “సమస్య పరిష్కారం కోసం చట్టాలను ఉపసంహరించడానికి బదులు ఇతర విధాన నిర్ణయాలను కేంద్రం తీసుకోవా ల్సింది. కానీ, రైతుల ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది. యూపీ, పంజాబ్లో గెలవాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఎలాంటి మంచి జరగదు. రైతులకు చట్టాల్లో స్వేచ్ఛ కల్పించారు. స్వాతంత్ర్యానికి ముందు ఆ తర్వాత జరిగినట్లుగా రైతులు ఇకపైనా దౌర్జన్యానికి గురవుతారు. పార్లమెంట్లో ఆమోదించే సమయంలో సరిగా చర్చ జరిపి ఉంటే, లేదా పార్లమెంటరీ ప్యానెల్కు సిఫార్సు చేసి ఉంటే చట్టాలు కొనసాగేవ’న్నారు. ‘రెండు చట్టాలు ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. కొత్త చట్టాల్లో కొన్ని నిబం ధ నల అమలును నిలిపివేసినా. పలు రాష్ట్రాలు అదే తరహా నిబంధనలను ప్రవేశ పెట్టాయి. ప్యానెల్ అందించిన నివేదికను సుప్రీంకోర్టు విడుదల చేయకపోతే నేనే ప్రజలకు అందు బాటులోకి తెస్తాం. ప్యానెల్ రిపోర్టు రైతులకు ప్రయోజకరంగానే ఉంది. నివేదిక విడుదలపై వచ్చే వారం నిర్ణయం తీసుకుంటాం’ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos