ప్రేయసి కోసం గుడి కట్టాడు..

ప్రేయసి కోసం గుడి కట్టాడు..

తల్లితండ్రులపై ప్రేమతోనే లేదా రాజకీయ నాయకులు,సినీ తారలపై అభిమానంతోనే విగ్రహాలు పెట్టడం ఇప్పటివరకు చూశాం.అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయి జ్ఞాపకార్థంగా ప్రతిమను ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది.జిల్లాలోని జామి గ్రామానికి చెందిన ఎర్నిబాబుకు కొద్ది కాలం క్రితం ఆన్‌లైన్‌లో ఓ యువతి పరిచయమైంది.మొదట్లో మెసేజ్‌లతో మొదలైన వీరి స్నేహం త్వరగానే ప్రేమ పట్టాలెక్కింది.అయితే గత ఏడాది యువతి అనారోగ్యంతో మృతి చెందింది.ప్రేయసి మృతిని తట్టుకోలేకపోయిన ఎర్నిబాబు చాలా కాలం పాటు ప్రేయసి జ్ఞాపకాల నుంచి బటయకు రాలేకపోయాడు.ప్రతిరోజూ ప్రేయసినే కలవరించేవాడు.దీంతో తన ప్రేమకు చిహ్నంగా ఇంటిపై ప్రేయసి ప్రతిమతో గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు.అందుకు ఎర్నిబాబు తల్లితండ్రులతో పాటు యువతి తల్లితండ్రులు సైతం అంగీకరించారు.ఎర్నిబాబు ప్రేమను అర్థం చేసుకున్న యువతి తల్లితండ్రులు తమ కూతూరి ప్రతిమను ఎర్నిబాబు గ్రామానికి పంపించారు.దీంతో తన ప్రేయసి ప్రతిమను ఊరంతా ఊరేగింపు నిర్వహించి తన ఇంటిపై కట్టిన గదిలో ప్రతిష్టించాడు.ఊరేగింపు కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గ్రామంలోని 300 కుటుంబాలకు బియ్యం సైతం పంచాడు..

యువతి ప్రతిమకు ఊరేగింపు..

ఊరేగింపులో సాంస్కృతిక కార్యక్రమాలు..

 

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos