ఆ విమాన సిబ్బంది అంతా విగత జీవులే

ఆ విమాన సిబ్బంది అంతా విగత జీవులే

న్యూఢిల్లీ: ప్రమాదానికి గురైన ఏఎన్‌-32 విమానంలో ప్రయాణించిన 13 మంది సజీవంగా ఉన్న ఆనవాళ్లు కనిపించలేదని అక్కడ శోధిస్తున్న వాయుసేన బృందం ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఎవ్వరూ ప్రాణాలతో బయటపడలేదని వారి కుటుంబాలకు సమాచారాన్ని అందించామని చెప్పారు. ఏఎన్‌-32 విమానం ఈ నెల మూడున అసోంలోని జోర్హాట్ నుంచి మెంచుకాకు బయలుదేరింది. దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా ఎగురుతున్నపుడు రాడార్‌ నుంచి అదృశ్యమైంది. లిపోకు ఉత్తరాన, టాటోకు ఈశాన్యాన 16 కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలను గాలింపు బృందం గత మంగళ వారం గుర్తించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos