న్యూఢిల్లీ: ప్రమాదానికి గురైన ఏఎన్-32 విమానంలో ప్రయాణించిన 13 మంది సజీవంగా ఉన్న ఆనవాళ్లు కనిపించలేదని అక్కడ శోధిస్తున్న వాయుసేన బృందం ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఎవ్వరూ ప్రాణాలతో బయటపడలేదని వారి కుటుంబాలకు సమాచారాన్ని అందించామని చెప్పారు. ఏఎన్-32 విమానం ఈ నెల మూడున అసోంలోని జోర్హాట్ నుంచి మెంచుకాకు బయలుదేరింది. దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా ఎగురుతున్నపుడు రాడార్ నుంచి అదృశ్యమైంది. లిపోకు ఉత్తరాన, టాటోకు ఈశాన్యాన 16 కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలను గాలింపు బృందం గత మంగళ వారం గుర్తించింది.