అమరావతి : రైతు భరోసా లో అధికార యంత్రాంగం తమ నైపుణ్యాల్ని ప్రదర్శిస్తోంది. ఈ పథకం చిత్ర విచిత్రాలకు వేదికైంది. రైతు భరోసా లబ్ధిదారుగా విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ను ఎంపిక చేయటం అధికార్ల స్వామి భక్తికి తిరుగులేని నిదర్శనం. నిబంధనల ప్రకారం అయిదె కరాలకు మించి పొలం ఉన్నవారు, ప్రజాప్రతినిధులు,ఆదాయపు పన్ను చెల్లించే వారు, ఎంపిపి, ఎంపిటిసి, సర్పంచ్గా పని చేసిన వారు ఈ పథకానికి అనర్హులు. నిబంధనల్ని తుంగలో తొక్కి ఏకంగా మంత్రినే లబ్ధిదారుగా చేసిన అధికార్ల లీలలు సామాన్యులకు తేలిగ్గానే అర్థమవుతాయి.