అమరావతి: రాజధానిగా అమరావతే కొనసాగాలని జనసేన, భాజపా పోరాడితే వారి పొత్తును స్వాగతిస్తానని తెదేపా అధ్య క్షు డు చంద్రబాబు నాయుడు శనివారం తెలిపారు. ‘పవన్ కల్యాణ్ భాజపాతో పొత్తు పెట్టుకున్నారు, సంతోషం. అమరావతిని రాజ ధానిగా కొనసాగించ డానికి మీ పొత్తును ఉపయోగిస్తే మనస్ఫూర్తిగా అభినందిస్తాను. జగన్ అరాచకాలకు మీరు కూడా భయ పడి, పోరాడకపోతే ఉపయోగం లేద’ ని వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం జరిగిన అమరావతి పరిరక్షణ ప్రజా చైతన్య యాత్రలో ఈ వ్యాఖ్యల్ని చేసారు.